ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ

Published: Tuesday April 04, 2023

మధిర, ఏప్రిల్ 3 ప్రజా పాలన ప్రతినిధి:మధిరలో కంసాని కావ్య భర్త శ్రీను రోటరీ నగర్ ఖమ్మం కుటుంబ కలహాల నేపథ్యంలో నిన్న రాత్రి 7 గంటల సమయంలో మధిరలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోబోవుగా వాళ్ళ బాబు 100 కి డయల్ చేయగా కానిస్టేబుల్ శివ ,జి ఆర్ పి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి సదరు మహిళలను కాపాడి ప్రతి సమస్యకు పరిష్కారం చావు కాదని కౌన్సిలింగ్ ఇచ్చి మధిర రెస్క్యూ టీం ఆదరణ ఫౌండేషన్ నిస్సి హరిణి కి అప్పజెప్పడం జరిగింది అనంతరం వాళ్ల బంధువులకు సమాచారం అందించి వాళ్ల ఊరు పంపించడం జరిగింది.