ఉత్తమ అవార్డు గ్రహీత ఐకెపి ఏపిఎం 'పద్మలత' ప్రశంస పత్రాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ వి పి గౌ

Published: Saturday January 28, 2023
బోనకల్, జనవరి 27 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో స్నేహంజలి మండల సమాఖ్య ఐకెపి ఎపిఎంగా విధులు నిర్వహిస్తున్న యద్దనపుడి పద్మలత ఉత్తమ ఏపీఎం గా ఎంపికైంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ వి పి గౌతం పద్మలతకు ఉత్తమ ఏపిఎం అవార్డు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఐకెపి కార్యక్రమాలలో అత్యుత్తమ సేవలు అందించిన పద్మలతను ఉత్తమ ఏపీఎం గా ఎంపిక చేశారు. డ్వాక్రా మహిళలకు శ్రీనిధి అందించడంలోనూ, శ్రీనిధి వసూలలోనూ, డ్వాక్రా గ్రూపులకు పొదుపులు సక్రమంగా కట్టించడంలోనూ, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సక్రమంగా బ్యాంకులకు చెల్లించే విధంగా, డ్వాక్రా గ్రూపులు సక్రమంగా నిర్వహించడం లోనూ పద్మలత విశేషమైన సేవలందించారు. ఉత్తమ ఏపీఎంగా ఎంపికైన పద్మలతను ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, నాయబ్ తాసిల్దార్ సంగు శ్వేత, ఈజీఎస్ ఏపీవో బసవోజు కృష్ణకుమారి, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సీసీలు లావూరి ఝాన్సీ బాయ్, కనకపుడి వెంకటేశ్వర్లు, పుడియాల పుల్లయ్య, గడ్డిగోపుల శ్రీనివాసరావు, జెట్టి శోభ, స్నేహాంజలి మహిళా మండలి అధ్యక్షురాలు అజ్మీర సోనీ, కోశాధికారి దుర్గ ఐకెపి సిబ్బంది, గ్రామ దీపికలు , వివిధ శాఖల మండల అధికారులు అభినందించారు.