ఉప్పల్ డివిజన్లో బీజేపీలోకి భారీ చేరికలు

Published: Wednesday August 11, 2021
మేడిపల్లి, ఆగస్ట్10 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు రెడ్డి గారి దేవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జీవనే బస్వరాజు లింగాయత్ ఆధ్వర్యంలో ఉప్పల్ డివిజన్లోని లక్ష్మీనారాయణ కాలనీ నుండి యువకులు దాదాపు 100 మంది బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీ వాణి వెంకట్రావు, మేడ్చల్ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి, మర్నేని ఫణీంద్ర, సింగారం కార్తిక్, బొడ్డు రవీందర్, మహాపాత్ర పుష్టి, రఘు కుమార్, టెంట్ రమేశ్, బీజేపీలో చేరిన వారు నర్సింహ, శ్రీధర్, రమేష్, రవికుమార్, ప్రవీణ్, సింహాచలం, రామకృష్ణ యాదవ్, బొడ్డు రాజారామ్, బొడ్డు మనోహర్, చేతన్య, రావి, రఘు, ఆంజనేయులు, మురరి, అఖిలేష్, అనిల్, నరేష్, వినోద్, రమేశ్ నాయక్, సునీల్ సింగ్, సురేష్ సింగ్, రత్నాకర్ పాల్, రమణా, కిరణ్, సాయి తదితరులు ఉన్నారు.