జంట కార్పొరేషన్లలో క్రిస్మస్ కానుకలు పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి మేయర్లు కార్పొరేటర్ల

Published: Wednesday December 21, 2022
మేడిపల్లి, డిసెంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ కుటుంబాలకు అందజేస్తున్న క్రిస్మస్ కానుకలను రాష్ట్ర కార్మిక & ఉపాది కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి జంట కార్పొరేషన్ల మేయర్లు జక్క వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్లు కుర్ర శివకుమార్ గౌడ్, కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లతో కలిసి క్రైస్తవ సోదరసోదరిమనులకు పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, క్రైస్తవ సోదరీ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.