వికారాబాద్ అభివృద్ధికి సహకరించండి

Published: Tuesday December 06, 2022
 త్వరలో కేటీఆర్ టీం పర్యటన
* చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 5 డిసెంబర్ ప్రజా పాలన : వికారాబాద్ ప్రాంతం అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి చేశామని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా రైల్వే వంతెన నిర్మాణం, అనంతగిరి పర్యాటక కేంద్రం, శ్రీ అనంతపద్మనాభ స్వామి వారి ఆలయ అభివృద్ధి, మొదలైన అభివృద్ధి అంశాలపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన కేటిఆర్ త్వరలో  టీం పర్యటిస్తుందని, వికారాబాద్ అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారని స్పష్టం చేశారు.