జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి
Published: Wednesday April 12, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 11 ఏప్రిల్ ప్రజా పాలన : జిల్లాలో పదవ తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. పదవ తరగతి పరీక్షలు చివరి రోజైన మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అలాగే సంఘం లక్ష్మీబాయి పాఠశాలల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను వికారాబాద్ తహసిల్దార్ వాహెదా ఖాతూన్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు అన్ని సక్రమంగా జరగాలని ఆన్నారు. పరీక్షలన్నీ కాపీయింగ్ లేకుండా, క్వాలిటీగా నిర్వహించడం జరిగిందని అన్నారు. పరీక్షలకు హజరైన విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలు బాగా రాశారా, ఎంతమంది పాస్ అవుతారని అడిగారు. పరీక్షకు ఎంత మంది గైరాజరైనారని వారికి సంబంధించిన ప్రశ్న పత్రాలను సురక్షితంగా భద్రపరిచారా అని చీఫ్ సూపరింటెండెంట్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది, మరెవరు కూడా పరీక్ష కేంద్రంలోనికి సెల్ ఫోన్స్ తీసుకురాకుండ చూడాలని ఆదేశించారు.
Share this on your social network: