మిలీనియం పాఠశాలలో ఘనంగా సైన్స్ దినోత్సవం మధిర ఫిబ్రవరి 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ ప

Published: Wednesday March 01, 2023
ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ ఎక్స్పో కార్యక్రమం పట్టణంలోని మిలీనియం టాలెంట్ స్కూల్ నందు మంగళవారం నాడు సైన్స్ డే వేడుకలని ఘనంగా నిర్వహించడం జరిగింది.ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ డి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో  సైన్స్ పితామహుడు సర్ సి.వి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
అనంతరం విద్యార్థినీ విద్యార్థులు పాఠశాలలో సైన్స్ ఎక్స్ కార్యక్రమం నిర్వహించి సైన్స్ విభాగానికి సంబంధించిన పలు అంశాలను  ప్రదర్శించగా అవి చూపరులని ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ... విద్యార్థులు  క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి.శ్రీనివాసరావు, రాజేశ్వరి, టి.శ్రీనివాసరావు,సైన్స్ ఉపాధ్యాయులు పాషా,సురేష్,వేదా తదితరులు పాల్గొన్నారు.