సెప్టెంబరు 1న బడిగంట మ్రోగటం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు

Published: Wednesday August 25, 2021
బాలాపూర్: ఆగస్టు 24, ప్రజాపాలన ప్రతినిధి : మంత్రుల వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న బడంగ్ పేట్, మీర్ పేట్ మేయర్లు, కార్పొరేషన్ అధికారులు. సెప్టెంబర్ 1 నుండి తరగతులు ప్రారంభించడానికి కోవిడ్19 వల్ల వచ్చిన సంక్షోభంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మంత్రులు కమిషనరేట్ నుండి జిల్లాపరిషత్ చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు, ఆధికారులతో మంగళవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్ మేయర్ లు కార్పొరేషన్ అధికారులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి స్కూల్ పరిశుభ్రతతో పాటు జాగ్రత్తలు పాటించాలని మంత్రుల వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్పేట్ కార్పొరేషన్ మేయర్ మూడవత్ దుర్గ దీప్ లాల్ చౌహన్, కమిషనర్ సత్యబాబు, డీ. ఈ గోపీనాథ్, ఏ. ఈ  శ్రీనివాస్, రాంప్రసాద్, పాల్గొన్నారు.