"మే " డే ఉత్సవాలను విజయవంతం చేయండి

Published: Wednesday April 27, 2022
టి ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎస్ సి ఎల్ యు, ప్రధాన కార్యదర్శి టి, మనీ రామ్ సింగ్.
బెల్లంపల్లి ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి: ప్రపంచ కార్మికుల దినోత్సవం 136వ "మే" డే ఉత్సవాల సందర్భంగా మే 1 ఆదివారం హైదరాబాదులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించే 136వ "మే" డే ఉత్సవాలను సింగరేణి లోని 11 ఏరియాలకు చెందిన సింగరేణి కాలరీస్ లేబర్  యూనియన్, టి ఎన్ టి యు సి, నాయకులు, కార్యకర్తలు, కేంద్ర కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్, ప్రధాన కార్యదర్శి, పి మణి రామ్ సింగ్ లు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింలు, టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు, ఎం కె బోస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వి వి రత్నాకర్ రావు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి, ఏడుకొండలు, పెద్ద పెళ్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్, కొమరం భీమ్ జిల్లా అధ్యక్షులు, జి.ఆనంద్, టి ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏ బి, మోహన్ రావు, తదితరులు పాల్గొంటారని, అనంతరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో పాల్గొనుటకు గురించి, చర్చించడం జరుగుతుందని తెలిపారు.