మెాడి బహిరంగ సభకు తరలివెళ్ళన బీజేపీ బిజేవైఎం నాయకులు

Published: Monday July 04, 2022
జన్నారం రూరల్, జూలై 03, ప్రజాపాలన: 
 
 రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రాండ్లలో నిర్వహించే  పధాని నరేంద్రమోడీ  బహిరంగ సభకు  మండలకేంద్రం నుంచి ప్రత్యేక బస్సు లో బిజెపి, బిజేవైయం నాయకులు ఆదివారం  తరలి వెళ్ళారు. మోదీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని ఆపార్టీ జిల్లా నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ముందస్తు గా ఏర్పాట్లు చేసుకున్నారు. మండలం లోని అన్ని గ్రామాల్లో ని ముఖ్య కార్యకర్తలను సభకు తరలించారు. ముందు గా మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. మోదీ సభకు వెళ్లిన వారిలో   జిల్లా బిజేపి నాయకులు బద్రినాయక్, కోంతం శంకరయ్య, మండల ప్రదాన కార్యదర్శి రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు రాగుల సూర్యం, బిజేవైఎం జిల్లా నాయకులు మహేష్, మదు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.