నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేత

Published: Tuesday September 07, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 6, ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల కరోనాతో మృతిచెందిన బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం కొనంపేట కూర్మగూడెం గ్రామానికి చెందిన సూర మారయ్య కుటుంబానికి ప్రతి నెల ఇస్తున్నట్లు 3వ నెల అయిన ఈ నెలలో కూడా 25 కిలోల బియ్యం, కూరగాయలు, మరియు నిత్యావసర సరుకులు సోమవారం నాడు పంపిణి చేయడం జరిగిందనీ ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ ఫేర్ కమిటీ మరియు ఆల్ ముస్లిం మైనారిటీ యూత్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కొనంపేట లోని మానసిక మరియు శారీరక వికలాంగుల కుటుంబానికి మరియు క్యాన్సర్ వ్యాధి తో మృతి చెందిన నిరుపేద కుటుంబానికి  బియ్యం నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందనీ వారు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్  తిరుపతి రెడ్డి, మాట్లాడుతూ ప్రతి నెలా బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ ఆక్షన్ కమిటీ మరియు ఆల్  ముస్లిం మైనార్టీ యూత్ కమిటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అన్వర్ ఖాన్, అన్వరుద్దీన్, ఉపసర్పంచ్ సుమలత-రమేష్, మాజీ జడ్పిటిసి కోడిపే భారతి శంకర్, యండి. జాఫర్, ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ సభ్యులు తాజ్ ఖాన్, రషీద్ ఖాన్, గజ్జల సందీప్ తదితరులు పాల్గొన్నారు.