బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వ నుంచి నిధులు

Published: Thursday August 05, 2021
బాలాపూర్: ఆగస్టు 03, ప్రజాపాలన ప్రతినిధి : బోనాల పండగ సందర్భంగా దేవాలయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ 15 కోట్ల నిధులు విడుదల చేసారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఆషాడ మాస బోనాల సందర్భంగా మంజూరైన చెక్కులను మంగళవారం నాడు ఆయా దేవాలయాల ప్రతినిధులకు కార్పొరేషన్ మేయర్, కార్పొరేషన్ అధికారులతో పాటు కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. మహేశ్వరం నియోజకవర్గానికి సంభందించి సుమారు 11 లక్షల రూపాయల సంభందించి చెక్కులను మంత్రి పంపిణీ చేసారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.... రంగారెడ్డి జిల్లాలోని 349 దేవాలయ కు 1 కోటి 9 లక్షల 33 వేల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. జిల్లాలో ని జిహెచ్ఎంసి పరిధిలోని మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్ బి నగర్ లలోని దేవాలయాల కు నిధులు కేటాయించినట్లు మంత్రి అన్నారు. గత సంవత్సరం కోవిడ్ కారణంగా బోనాలు జరుపుకోలేక పోయామని, ఈ సంవత్సరం అత్యంత ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నరసింహ్మరెడ్డి, మీర్ పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్ పేట్, బడంగ్ పేట్ కార్పొరేటర్లు ఆయా దేవాలయాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.