కొత్తపేట నాగలయ దేవస్థానం లో ఎంపీపీ పూజ కార్యక్రమాలు
రాయికల్, ఆగష్టు 02 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం కొత్తపేట గ్రామములోని శ్రీ రాజరాజేశ్వర నాగలయం లో నాగులచవితి సందర్బంగా రాయికల్ ఎంపీపీ శ్రీమతి సంధ్యారాణి సురేందర్నాయక్ గారు ప్రత్యేక పూజలు చేసి పుట్టలో పాలు పోయటం జరిగింది అనంతరం ఆలయం లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో ఆలయ ఛైర్మెన్ ధనకంటి ప్రవీణ్, గ్రామ సర్పంచ్ బత్తిని రాజేశం, మరియు మన్నెగుండ్ల వెంకమ్మ నర్సయ్య, ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, మూటపెల్లి సర్పంచ్ బేక్కం తిరుపతి, మాజీ ఎంపీపీ ఉత్కమ్ రాధా సాయగౌడ్, ఆలయ ఈ ఓ విక్రమ్ గౌడ్, ఉపసర్పంచ్ రాజేశేఖర్ రెడ్డి,ఆలయ డైరెక్టర్స్ కే.రాజారెడ్డి, అంతడుపుల రాజాం, రంజిత్, బ్రహ్మం, జక్కుల ప్రసాద్, మూటపెల్లి ఉపసర్పంచ్ చొప్పరి రంజిత్, సెక్రటరీ మౌనిక, ఆలయ పంతులు రాజేశ్వర శర్మ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Share this on your social network: