కొత్తపేట నాగలయ దేవస్థానం లో ఎంపీపీ పూజ కార్యక్రమాలు

Published: Wednesday August 03, 2022

రాయికల్, ఆగష్టు 02 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం కొత్తపేట గ్రామములోని శ్రీ రాజరాజేశ్వర నాగలయం లో నాగులచవితి సందర్బంగా రాయికల్ ఎంపీపీ శ్రీమతి సంధ్యారాణి సురేందర్నాయక్ గారు ప్రత్యేక పూజలు చేసి పుట్టలో పాలు పోయటం జరిగింది అనంతరం ఆలయం లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం లో ఆలయ ఛైర్మెన్ ధనకంటి ప్రవీణ్, గ్రామ సర్పంచ్ బత్తిని రాజేశం, మరియు మన్నెగుండ్ల వెంకమ్మ నర్సయ్య, ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మహేశ్వరరావు, మూటపెల్లి సర్పంచ్ బేక్కం తిరుపతి, మాజీ ఎంపీపీ ఉత్కమ్ రాధా సాయగౌడ్, ఆలయ ఈ ఓ విక్రమ్ గౌడ్, ఉపసర్పంచ్ రాజేశేఖర్ రెడ్డి,ఆలయ డైరెక్టర్స్ కే.రాజారెడ్డి, అంతడుపుల రాజాం, రంజిత్, బ్రహ్మం, జక్కుల ప్రసాద్, మూటపెల్లి ఉపసర్పంచ్ చొప్పరి రంజిత్, సెక్రటరీ మౌనిక, ఆలయ పంతులు రాజేశ్వర శర్మ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.