తంగడపల్లి రోడ్డు ఎదురుగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం

Published: Wednesday November 30, 2022
చౌటుప్పల్ నవంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జాతీయ రహదారిపై తంగడపల్లి రోడ్డు ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను తొలగించాలని వర్థకసంఘం ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు వీసం చంద్రారెడ్డి, కార్యదర్శి శ్యామ్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ ధనుంజయ, గుండు శంకరయ్య, కిరాణా సంఘం అధ్యక్షులు శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం రమేష్, ఢిల్లీ మాధవరెడ్డి, క్లాత్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా బిక్షం, పిల్లలమర్రి అశోక్, పిఎసిఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మండల అధ్యక్షులు గిరికాటి నిరంజన్, ఎర్ర వెంకటేశం, లింగాల లింగం గౌడ్, గట్టు ప్రభాకర్ ,ఉప్పల కృష్ణ, గజ్జల శ్రీనివాస్, అలిసేరు వీరస్వామి, ఎర్రోజు యజ్ఞమాచారి, రుద్ర చంద్రశేఖర్, తూర్పునూరు మల్లేశం గౌడ్ ,బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.