డివిజన్లోని సమస్యలపై కార్పొరేటర్ విస్తృత పర్యటన

Published: Thursday May 27, 2021
మేడిపల్లి, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ డివిజన్లోని ప్రజా సమస్యలపై స్థానిక కార్పొరేటర్ మందుముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి విస్తృత పర్యటన చేశారు. ఈమేరకు డివిజన్లోని లక్ష్మినారాయణకాలనీ, శ్రీరమణపురం కాలనీల్లో కార్పొరేటర్ పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణకాలనీవాసులు డ్రైనేజ్ సమస్యను కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కార్పొరేటర్ త్వరలోనే కొత్త అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసి సమస్య  పరిష్కరించనున్నట్టుగా హామీ ఇచ్చారు. శ్రీరమణపురంలోనూ డ్రైనేజీ, మంచినీటి సమస్యలను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తేవడంతో దశల వారిగా పరిష్కరించనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు లూకాస్, రత్న రెడ్డి, బాబు రావు, బోడు రవీందర్, నర్సింహా రెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజు, భాస్కర్, అలెగ్జాండర్, రంగ రెడ్డి, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.