సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్కు నరసింహ ప్రథమ వర్ధంతి సభ

Published: Monday July 26, 2021
ఇబ్రహీంపట్నం, జులై 25, ప్రజాపాలన ప్రతినిధి : ఈ నెల 27 వ తేదీన శాస్త్ర పంక్షన్ హల్ లో వుంటుంది ఈ యొక్క వర్ధంతి సభ ను జయప్రదం చేయగలరని ప్రజానాట్యమండలి జిల్లా సహాయ కార్యదర్శి జంగిలీ రాజశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ నరసింహ విద్యార్థి దశలోనే ఉద్యమాల పోరు బాట పట్టి  భూమి కోసం భక్తి కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దున్నే వానికి భూమి కావాలంటూ పేదల పక్షాన నిలబడి ఎర్రజెండాను చేతబట్టి పదపదమంటూ సాధించిన ఘనత నరసింహ కు దక్కిందని అన్నారు. ఈ వర్ధంతి సభలో ప్రజానాట్యమండలి కళాకారుల చేత సాంస్కతిక కార్యక్రమాలు వుంటాయని తెలియజేసారు.