క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయండి

Published: Wednesday April 19, 2023
అశ్వారావుపేట ప్రజాపాలన (ప్రతి నిధి)జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఉపాధ్యాయుల సూర్య ప్రకాశరావు ను అభినందించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
 టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఉపాధ్యాయుల సూర్యప్రకాశరావును మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. మంగళవారం దమ్మపేట మండలంలోని గండగులపల్లి ఆయన స్వగృహంలో అశ్వరావుపేట బి ఆర్ఎస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు బండి పుల్లారావు సారధ్యంలో తుమ్మల నాగేశ్వరావు ను కలిశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులకు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ ని గ్రామస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే నాగేశ్వరరావు ను మరల అత్యధిక మెజార్టీతో గెలిపించడంతోపాటు మరల రాష్ట్రంలో బి ఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మనందరిపై ఉన్నదని అందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ ఆ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చూడాలని తెలిపారు. ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలని దిశ నిర్దేశం చేశారు. ఐక్యమత్యంతో నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలని తెలిపారు.మాజీ మంత్రి తుమ్మలను కలిసిన వారిలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, మాజీ జెడ్పిటిసి జెకెవి రమణారావు,పార్టీ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, రాష్ట్ర పామాయిల్ సంఘం డైరెక్టర్ కాసాని చంద్రమోహన్, నాయకులు తాడేపల్లి రవి తదితరులు ఉన్నారు.