విపత్కర పరిస్థితుల్లో రైతుబందు నిధులు విడుదల
Published: Wednesday June 16, 2021
బీరుపూర్, జూన్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలోని బీరుపూర్ కండ్లపల్లి మంగేల చర్లపల్లి రంగసాగర్ తదితర గ్రామాల్లో రైతులకు రైతుబందు డబ్బులు విడుదల చేయడంతో గ్రామాల్లో తెరాస నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడ రైతుబందు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తేలియజేస్తు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పర్వతం రమేష్ ఘర్షకుర్తి శిల్పరమేష్ అజ్మీర ప్రభాకర్ బోడ స్వప్నసాగర్ చుంచు శారదనరేందర్ కొమురేల్లి పూర్ణచంధర్ కృష్ణారావు సూశీన్ పుడూరి సుధాకర్ రామకిస్టు గంగాధర్ తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: