కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై జీఎస్టీని రద్దు చేయాలి*

Published: Thursday January 05, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 04, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐ బి గెస్ట్ హౌస్ లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత ను కలసి కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై జీఎస్టీని రద్దు చేయాలని వినతి పత్రం అందజేసిన తెలంగాణ పద్మశాలి విద్యార్థి, యువజన సంఘం నాయకులు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులపై చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ రద్దు చేయాలనీ చేనేత కార్మికుల మద్దతుగా పార్లమెంట్ లో ప్రసంగించాలని ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భుమేష్, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం పట్టణ అధ్యక్షులు బింగి ప్రవీణ్, తెలంగాణ పద్మజాల విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరల వంశీ, పద్మశాలి యువజన సంఘం నాయకులు బండి సాధన్ తదితరులు పాల్గొన్నారు.