పంట నష్టపోయిన రైతులను సర్కారు ఆదుకోవాలి
Published: Wednesday May 18, 2022
బిజేపి ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నాయకుడు హరినాయక్
జన్నారం రూరల్, మే 17, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో యాసంగి పంట రైతులు అకాల వర్షాలతో వరి దాన్యం తడిచిపోయి , పంట నష్టపోయిన రైతన్న లను సర్కారు ఆదుకోవాలని బిజేపి ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నాయకుడు హరినాయక్ అన్నారు, మంగళవారం వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వానాలతో పంట పొలంలో వరి దాన్యం పూర్తిగా తడిచి పోయిందని దీంతో రైతన్నలు నష్టపోయె ప్రమాదం ఉందని అన్నారు, ఆ రైతులకు సర్కారు నష్టపరిహారం అందించాలని అయన తెలిపారు, ఈ కార్యాక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు గోలి చందు, బిజేవైఎం మండల అద్యక్షుడు ముడుగు ప్రవీణ్, బిజేవైఎం జిల్లా నాయకులు కొండపల్లి మహేష్, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Share this on your social network: