మంత్రి మల్లారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి

Published: Friday October 07, 2022
మేడిపల్లి, అక్టోబర్ 6 (ప్రజాపాలన ప్రతినిధి)

దసరా పండుగను పురస్కరించుకొని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి

నివాసంలో ఆయనకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్, 5వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ, బీసీ అధ్యక్షులు జడిగే నవీన్ యాదవ్             తదితరులు ఉన్నారు.