నూకపల్లి డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించిన - ఎమ్మెల్సీ కవిత

Published: Wednesday June 02, 2021
జగిత్యాల, జూన్ 01 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల నూకపల్లిలోని 4200 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించడంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లా కలెక్టర్ రవి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తో కలసి పర్యవేక్షించి పరిశీలించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జగిత్యాల ప్రజలు జిల్లా కావాలనే కొన్ని దశాబ్దాల కళ నెరవేర్చిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలోనే హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో 4000 కు పైగా డబుల్ బెడ్రుమ్ ఇండ్లను సాంక్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందని ప్రతి పేదవారి ఇంటికల నెరవేర్చడమే కేసీఆర్ లక్ష్యం అని అన్నారు. ఇంటి నిర్మాణాలు చూస్తే కేసీఆర్ సంతోష పడతారని జగిత్యాల అభివృద్దికి నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని సీఎం ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చుతు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని హామి ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ఎంపీపీ రాజేంద్రప్రసాద్ జడ్పీటిసి సంగెపు మహేష్ దావ సురేష్ జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీ కౌన్సిలర్లు ప్యాక్స్ చైర్మెన్స్ తదితరులు తెరాస నాయకులు కార్యకర్తలు కవిత వెంట ఉన్నారు.