కేజీబీవీ లో పనిచేస్తున్న ఎస్ఓ లను బదిలీ చేయాలి ** డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ **

Published: Thursday September 15, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 14 (ప్రజాపాలన, ప్రతినిధి) : కేబీ జిల్లా వ్యాప్తంగా కేజీబీవీ లో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎస్ ఓ లను బదిలీలు  చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న కేజీబీవీ ఎస్ వో లు విద్యార్థుల పట్ల ఇష్టారాజ్యంగా ఇష్టమైన ట్లుగా విధులు నిర్వహిస్తూ కేజీబీవీ హాస్టల్ సంస్థల వలయాలుగా మారుస్తున్నారని అన్నారు. ఒకే చోట విధులు నిర్వహించడం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. జిల్లాలో ఉన్న విద్యాధికారుల పనితీరు కూడా నిర్లక్ష్యంగానే ఉందన్నారు. కావున విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఎస్ ఓ ల ను బదిలీలు చేస్తేనే, కేజీబీవీ లు అభివృద్ధి చెందుతాయన్నారు. వారిపై చర్యలు తీసుకొని వెంటనే కేజీబీవీ లో పనిచేస్తున్న ఎస్ వో ల ని బదిలీలు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు.
 
 
 
Attachments area