ప్రజా సమస్యలపై డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి
Published: Thursday April 21, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) : డివిజన్లోని ప్రజా సమస్యలపై పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి పర్యటించారు. ఈమేరకు కార్పొరేటర్ యుగంధర్ రెడ్డి బుద్ధ నగర్ కాలనీలో ఇంటింటికిి తిరుగుతూ మంచినీటి, చెత్త సేకరణ, విద్యుత్, మొక్కలు, పచ్చదనం, డ్రైనేజీ. రోడ్లు వంటి పలు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇకముందు డ్రైనేజ్ పొంగి ఇబ్బంది కలిగించకుండా శాశ్వత పరిష్కారదిశగా పెద్ద పైపులు మార్పించే పనులను ప్రారంభించామన్నారు. నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు గ్రూప్ 1 గ్రూప్ II, గ్రూప్ III, గ్రూప్ IV ఉద్యోగాలకు కావలసిన ఉచిత శిక్షణను యువత వినియోగించుకోవాలని కార్పొరేటర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, ఆదిత్య, మోహన్, రవి పాల్గొన్నారు.
Share this on your social network: