తల్లాడ పట్టణానికి నూతన శోభ.. తల్లాడ, నవంబర్ 16 (ప్రజాపాలన న్యూస్):
Published: Friday November 18, 2022
రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర నేడు సత్తుపల్లి నియోజకవర్గ పర్యటనకు రానున్నారు. అందులో భాగంగా తల్లాడలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు తల్లాడ పట్టణాన్ని ముస్తాబు చేశారు. భారీగా ప్లెక్షీలు, రింగ్ రోడ్డు చుట్టూ టిఆర్ఎస్ గులాబీరంగు తోరణాలు, బెలూన్లు కట్టారు. సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య రాజ్యసభ సభ్యులకు స్వాగతం పలుకుతున్నట్లుగా తోరణాలు ఏర్పాటు చేశారు. దీంతో తల్లాడ పట్టడం గులాబీ మయంతో కళకళ లాడుతోంది.
Share this on your social network: