ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 27ప్రజాపాలన ప్రతినిధి **ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని అదనపు కలెక
Published: Tuesday February 28, 2023
సమీకృత కార్యాలయంలో సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజల సమస్యలకు సంబందించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ తిరుపతి రావు స్వీకరించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ అంశాలపై 85దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
.
Share this on your social network: