మధిర సేవా సమితి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ కార్యక్రమం మధిర రూరల్ ఆగస్టు 7 ప్రజాపాలన ప్రతి

Published: Monday August 08, 2022
మధిర సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆవరణ నందు స్నేహితుల దినోత్సవ రోజు సందర్భంగా మిత్రులకు సేవా సమితి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో మిత్రులు ఒకరినొకరు స్నేహితుల బంధానికి తోరణాలు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి ముఖ్యులు జిల్లా ఆర్య వైశ్య నాయకులు సోదరుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు  ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహితానికి నేను ఎంతో విలువ ఇస్తానని మిత్రులు ఎటువంటి అవసరం ఉన్న నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్నేహితుల వాటి సంబంధాల గురించి వివరించారు
 ఈ వేడుకలో మధిర సేవాసమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు రంగా హనుమంతరావు గార్లు ఒకరినొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి అభినందనలు తెలుపుతూ మా సేవా సమితి ద్వారా మిత్రులు కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ మరెన్నో భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు దాతల సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య అధ్యక్షులు దాచేపల్లి ముత్యాలు, ప్రజా పాలన ప్రింట్ మీడియా విలేకరి పసుపులేటి  నాగేంద్ర శ్రీనివాస్, యర్రా లక్ష్మణ్, వందనపు శ్రీనివాసరావు, కోమటి సుధాకర్, బసవరాజు వాసుదేవరావు, దూపుకుంట్ల లక్ష్మీనారాయణ, చలువాది నరసింహారావు ఐరన్ అద్దేపల్లి బాపరాజు, దొడ్డా వెంకటనారాయణ,  షేక్ ఖాదర్ రిటైర్డ్ ఆర్టీసీ డిపో, ఎస్కే సైదా తదితరులు పాల్గొన్నారు
 
 
 
Attachments area