వాలీబాల్ కోర్టును ప్రారంభించిన రేగా కాంతారావు..

Published: Wednesday December 15, 2021
తల్లాడ, డిసెంబర్ 14 (ప్రజాపాలన న్యూస్) : తల్లాడలోని తహశీల్దార్ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టునుమంగళవారం ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు. గత రెండేళ్ల నుండి కోర్టులో కరోనా నేపథ్యంలో క్రీడాకారులు వాలీబాల్ ఆటలకు దూరంగా ఉన్నారు. దీంతో మైదానమంతా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రస్తుతం క్రీడాకారులు మైదానాన్ని శుభ్రం చేసి తీర్చిదిద్దారు. అనంతరం రేగా కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా వాలీబాల్ ఆటలంటే తల్లాడ పేరు అగ్రభాగాన ఉంటుందని గుర్తుచేశారు. క్రీడాకారులు ఎప్పటిలాగానే శిక్షణ పొంది ఈ గ్రామానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, క్రీడాకారులు మొక్క సైదులు, కిరణ్, చాంద్ భాషా, శ్రీకాంత్, కృష్ణ, ప్రసాద్, లక్ష్మణ్ రావు, నరసింహారావు, యాకూబ్ పాషా, రోబో తదితరులు పాల్గొన్నారు.