అనారోగ్యంతో మరణించిన సుమలత కుటుంబ సభ్యులను పరామర్శించిన డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

Published: Thursday June 30, 2022

కోరుట్ల, జూన్ 29 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో గుండె సంబధిత సమస్య తో  కొద్ది రోజుల క్రితం మరణించిన ఇంద్రాల సుమలత కుటుంబ సభ్యులను టీఅర్ఎస్ యువ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బుధవారం రోజున పరామర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి లో క్రియ శిల సభ్యత్వం తీసుకున్న సుమలత మరణించడం వలన వారి కుటుంబానికి తెరాస పార్టీ పరంగా అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి  తోట నారాయణ, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటీ వెంకట రావు, జెడ్పీటీసీ సభ్యురాలు ధారిషేట్టీ లావణ్య రాజేష్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు దారిషేట్టి రాజేష్ , గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య,ఉప సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు,  కార్యకర్తలు పాల్గొన్నారు.