నిరుపేద కుటుంబానికి పద్మశాలి సంఘ సభ్యులు చేయూత
Published: Monday October 17, 2022
ఇబ్రహీంపట్నం, అక్టోబర్16( ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు లచ్చన్న గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో ప్రయివేటు హాస్పిటల్ లో వైద్యానికి డబ్బులు లేక బాధపడుతూ చనిపోయారు ఉండడానికి ఇల్లు లేకున్న నిరుపేద కుటుంబ నికి చెందిన లచ్చన్న భార్య ఇద్దరు కొడుకులతో బీడీ కంపిని నడిపిస్తు పరువు మర్యాదలతో జీవితం కోనసాగించారు,బీడీ కంపనీలో కొన్ని డబ్బులు సంపాదించి చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు, వీరికి ఇద్దరు కుమారులు మహేందర్ ,మనోహర్ లలో పెద్ద కుమారుడు మహేందర్ మతి స్థిమితం కోల్పోయాడు ఇబ్బందులు పడుతున్న కుటుంబనికి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు మరియు నగదు 15000 వేల రూపాయలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో
జిల్లా పద్మశాలి అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డ మధు,తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సహాయ కార్యదర్శి రాపెళ్లి సురేష్, ఇబ్రహీంపట్నం మండల పద్మశాలి అధ్యక్షుడు చాట్ల గణేష్ చిలివేరి శ్రీనివాస్,వేముల శ్రీహరి, ఉడత రాజు, నందగిరి గిరీష్, చిలివేరి శ్రీధర్ ఉడుత శంకర్, సింగిల్విండో చైర్మన్ బాస శ్రావణ, మరియు పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు
Share this on your social network: