అయ్యవారి గూడెం లో జాతీయ ఉపాధి హామీ పనులపై అవగాహన కార్యక్రమం
Published: Wednesday October 06, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 05, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం యాచారం మండలం పరిధిలో అయ్యవారిగూడెం లోజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై మంగళవారం యాచారం మండలం అయ్యవారిగుడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై కూలీలకు అవగాహన కార్యక్రమాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కొప్పు సుకన్య భాష, గ్రామ సర్పంచ్ గంగా లచ్చి రామ్ నాయక్, ఉప సర్పంచ్ నక్క మహేందర్, వార్డ్ మెంబర్లు పాల్గొని ఉపాధి హామీ పనులపై గ్రామ సభలో కూలీలకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా చేపట్టాల్సిన పనులపై వారికి అవగాహన కల్పిస్తూ కూలీల హాజరు, వేతనాల చెల్లింపు, ఉపాధి హామీలో చేపట్టాల్సిన పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నర్సరీలను సిద్ధం చేయాలని, కూలీలను పెంచాలని కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఏపీఓ లింగయ్య, ఏపీఎం స్వరూప, కారోబార్ యాదగిరి, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: