మాల సంఘం అధ్యక్షుని ఏకగ్రీవం

Published: Wednesday May 11, 2022

వెల్గటూర్, మే 10 (ప్రజాపాలన ప్రతినిధి): మండల కేంద్రంలోని మాలలు సమావేశం నిర్వహించుకొని జూపాక కిరణ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. రెండవ సారి అధ్యక్షునిగా ఎన్నికైన కిరణ్ మాట్లాడుతూ మాలల అభివృద్ధికి, ఐక్యతకు కృషి చేస్తానని, నా మీద నమ్మకం ఉంచిన మాలలకు కృతజ్ఞతలు తెలియజేశారు.గౌరవ అధ్యక్షుడిగా లకుమల్ల దేవయ్య, ఉపాధ్యక్షునిగా మూగల రాజశేఖర్, సంఘ కార్యవర్గ సభ్యులుగా జూపాక కుమార్, ముగల సంతోష్, మంత్రి దేవేందర్, మంత్రి నరేష్, గౌరీ అరవింద్, జూపాక ప్రవీణ్, లకుమల్ల సాయి కృష్ణ, మంత్రి మహేష్, మంత్రి రాజు, భోజనం సాయి, పవన్, అభిషేక్, కొప్పుల ప్రవీణ్, జూపాక దేవయ్య, జూపాక లక్ష్మీరాజ్యం, కన్నెమల్ల గంగారం మంత్రి రాజయ్య, భోజనపు గంగారం, బండ్ర మల్లేష్, గౌరీ బుచ్చయ్య, ముగల సత్తయ్య, లకుమల్ల లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.