ఫోటో ఎక్స్ పో పోస్టర్ ఆవిష్కరించిన:ఎస్ఐ కొండలరావు

Published: Thursday September 30, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో అక్టోబర్ 1 2 3 తేదీలలో జరుగు ఫోటో ఎక్స్పో పోస్టర్ ను బోనకల్ ఎస్ఐ కొండలరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఫోటోగ్రఫీ అధ్యక్షులు దేవర నాగరాజు మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి మారగాని వెంకట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ కొండలరావు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది ఓ అద్భుతమైన కళ అని తరతరాలుగా నిలిచిపోయే తీపి గుర్తు అని అన్నారు. అదేవిధంగా ఈ ఫోటో ఎక్స్పో కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు దేవర నాగరాజు మాట్లాడుతూ ఈ ఫోటో ఎక్స్పో ఎగ్జిబిషన్ మన రాష్ట్రంలో జరగడం అదృష్టమని దీనిని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కొండలరావు, ఎస్సై సురేష్ జిల్లా అధ్యక్షుడు దేవర నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు మామిళ్ల నరసింహారావు మరియు పలువురు ఫోటోగ్రాఫర్ లు మరియు వీడియో గ్రాఫర్ లు  పాల్గొన్నారు.