ఫోటో ఎక్స్ పో పోస్టర్ ఆవిష్కరించిన:ఎస్ఐ కొండలరావు
Published: Thursday September 30, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : మండల ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో అక్టోబర్ 1 2 3 తేదీలలో జరుగు ఫోటో ఎక్స్పో పోస్టర్ ను బోనకల్ ఎస్ఐ కొండలరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఫోటోగ్రఫీ అధ్యక్షులు దేవర నాగరాజు మరియు రాష్ట్ర సహాయ కార్యదర్శి మారగాని వెంకట్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఐ కొండలరావు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది ఓ అద్భుతమైన కళ అని తరతరాలుగా నిలిచిపోయే తీపి గుర్తు అని అన్నారు. అదేవిధంగా ఈ ఫోటో ఎక్స్పో కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు దేవర నాగరాజు మాట్లాడుతూ ఈ ఫోటో ఎక్స్పో ఎగ్జిబిషన్ మన రాష్ట్రంలో జరగడం అదృష్టమని దీనిని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కొండలరావు, ఎస్సై సురేష్ జిల్లా అధ్యక్షుడు దేవర నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు మామిళ్ల నరసింహారావు మరియు పలువురు ఫోటోగ్రాఫర్ లు మరియు వీడియో గ్రాఫర్ లు పాల్గొన్నారు.
Share this on your social network: