ఎస్సి బాలికల వసతి గృహాన్ని సందర్శించిన షెడ్యూల్డ్ కులాల అధికారి
Published: Tuesday May 17, 2022
లక్షేటిపేట , మే 16, ప్రజా పాలన ప్రతినిధి,
మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పట్టణంలోని ఎస్సి బాలికల వసతి గృహం ను సోమవారం షెడ్యూల్ కులాల జిల్లా అధికారి రవీందర్ రెడ్డి సందర్శించడం జరిగింది. ఈ నెల 23న జరుగనున్న పదవ తరగతి పరీక్షల గురించి విద్యార్థులకు ఎలా చదవాలో చదివిన వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే హాస్టలో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు హాస్టల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ కె,సుజాత, విద్యార్థినిలు పాల్గొన్నారు.
Share this on your social network: