ఓటమి భయంతో రాజగోపాల్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయారు అభివృద్ధి కోసం నిలదీసిన ప్రజలపై దాడులా..?

Published: Monday October 17, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి):
బీజేపీ పార్టీ నాయకులను,పోటీ చేస్తున్న అభ్యర్థిని ప్రజలు తిరస్కరించారని, మునుగోడు ఎన్నికల తర్వాత బీజేపీ కనుమరుగైపోతుందన్నారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు.ఆదివారం ధర్మోజిగూడెం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ బీజేపీ నాయకులు ఆత్మపరిశీలనలో పడిపోయారని,అనవసరంగా ఉపఎన్నిక తెచ్చావని రాజగోపాల్ రెడ్డిని తిడుతున్నారని తెలిపారు.కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలతో ఆనందంగా ఉన్నారని తెలిపారు.ప్రజల కోసం రాజీనామా చేస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేవాడని,కాంట్రాక్టులకోసమే బీజేపీ పార్టీలో చేరారని విమర్శించారు.మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా నియోజకవర్గానికి వచ్చి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.దుబ్బాక,హుజురాబాద్ నిరయోజకవర్గాలలో గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి సాదించారో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు.కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని,ఇతర రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.
       ఏ కష్టమొచ్చినా,పదవి ఉన్నా లేకున్నా ప్రజలతో మమేకమై అండగా నిలబడిన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారితో గెలిపించాలని పిలుపునిచ్చారు.
      ఓటమి భయంతో రాజగోపాల్ రెడ్డి పిచ్చివాగుడు వాగుతున్నాడని,అభివృద్ది కోసం నిలదీసిన ప్రజలను బీజేపీ గుండాలతో దాడులు చేయిస్తున్నాడని, ప్రజలు ఒట్లతో తగిన బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తుల శ్రీశైలం, సామిడి బుచ్చిరెడ్డి, గుడిగంటి శంకర్ గౌడ్, దాసరి రామచంద్రం, వల్లబోతు లింగయ్య, రాఘవేంద్ర చారి, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు