ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ చేసిన కార్పొరేటర్ లలితారాణి

Published: Wednesday October 06, 2021
పాలేరు అక్టోబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు కానుకగా ఇచ్చిన చీరలను రవాణా శాఖ మంత్రి శ్రీ అజయ్, పాలేరు ఎమ్మెల్యే శ్రీ కందలా ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు 59వ డివిజన్ దానవాయిగూడెం లో కార్పొరేటర్ శ్రీమతి బట్ట పోతుల లలితా రాణి  ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ శ్రీమతి పునుకుల నీరజ, ఖమ్మం రూరల్ మండల తెరాసా పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, పాల్గొన్నారు మరియు ఖమ్మం టౌన్ తెరాసా పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మొరలి, చేతుల మీదుగా అందిచడం జరిగినది. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, నగర దీపికలు తదితరులు పాల్గొన్నారు