సర్వేంద్రియానాం నయనం ప్రధానం
Published: Tuesday December 07, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 06 డిసెంబర్ ప్రజాపాలన : శరీర అవయాలలో కళ్ళు అతి ముఖ్యమైన అవయవమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కూడలి సమీపంలో అపెక్స్ డయోగ్నోస్టిక్ సెంటర్ పై భాగంలో కేశవ్ నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని వ్యవస్థాపకులు డాక్టర్ కీసర వివేక్ రెడ్డి, డాక్టర్ సంకీర్త్ గంగా ఖేడ్కర్, డాక్టర్ అంబటి సంపత్ కుమార్, డాక్టర్ వెంకటేష్ గంగా ఖేడ్కర్ ల సమక్షంలో మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగమ్ ముత్తహర్ షరీఫ్, ఉమ్మడి రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ జి.సుధీర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వికారాబాద్ పట్టణంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్ లు, పట్టణ ప్రముఖులు, ఆయా రాజకీయ పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. కంటికి సంబంధించిన ప్రతి వ్యాధి గురించి నాణ్యమైన చికిత్సలతో పాటు సరసమైన ధరలకు కంటి చికిత్స అందించబడును. గత 33 సంవత్సరాల నుండి హైదరాబాద్ నగరంలో విశిష్ట సేవలు అందించి పేరు ప్రఖ్యాతులు గడించింది. ప్రస్తుతం వికారాబాద్ నగరంలో అవే సేవలు అతి తక్కువ ధరలో అందించేందుకు ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. ఆసుపత్రిలోని ఆప్టికల్లో కళ్ళ జోళ్ళ మీద 40 శాతం డిస్కౌంట్ ఇవ్వబడును.
Share this on your social network: