రక్తదాత ప్రతి ఒక్కరికి స్ఫూర్తిప్రదాత : కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్

Published: Monday July 18, 2022

శేరిలింగంపల్లి - ప్రజా పాలన/ జులై 17 :రక్తదాత ప్రతి ఒక్కరికి స్ఫూర్తిప్రదాత అని, ఒకరు రక్తదానం చేయడం వల్ల మరికొంతమందికి స్పూర్తి కలిగిస్తుందని ఆస్పూర్తి మరో వందల మంది ప్రాణాలు నిలబెట్టిడానికి పనికొస్తుందని కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్ తెలియజేసారు. ఆదివారం కొండాపూర్ డివిజన్ మజీద్ బండ అంబేద్కర్ చౌక్ వద్దగల కమ్యూనిటీ హాల్ లో మార్వరి యువ ముంచ్ సికింద్రాబాద్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి, కొండాపూర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయస్థితిలో ఉన్నవారిని ఆదుకోవడం కోసం ఆరోగ్యవంతులైనవారందరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయుటకు ముందుకు వచ్చిన వారిని అభినందించి ప్రశంస పత్రం అందజేశారు. రక్తదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన మార్వరి యువ ముంచ్ సికింద్రాబాద్ బ్రాంచ్ వారిని రఘునాథ్ యాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్వరి యువ ముంచ్ అధ్యక్షులు మానీష్, కార్యదర్శి మనోజ్ జైన్, కోశాధికారి ప్రదీప్ తివారి, జగదీశ్, బ్లడ్ క్యాంప్ నిర్వాహక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.