ఎమ్మెల్యే సొంత నిధులతో సిసి రోడ్ల నిర్మాణ స్థలంను పరిశీలించిన జడ్పిటిసి కుమార్ గౌడ్
Published: Saturday June 26, 2021
గుమ్మడిదల, 25 జూన్ 21, గుమ్మడిదల మండలంలోని రాంరెడ్డిభాయి గ్రామంలో సీసీ రోడు నిర్మాణ స్థలాన్ని జడ్పీపిసి కుమార్ గౌడ్ పరిశీలించారు ఆయన మాట్లాడుతూ సుమారు 45 లక్షల రూపాయల విలువ గలా పనులు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొంత నిధులతో కిలోమీటర్ మేరా సీసీ రోడ్ నిర్మాణం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మన పటాన్చేర్ శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి గ్రామాల అభివృద్దే ద్యేయంగా ఖర్చుకు వెనకడకుండా తన సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం హర్షించదగ్గ విషయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సద్ది విజయభాస్కర్ రెడ్డి, నక్క వెంకటేష్ గౌడ్, దామోదర్ రెడ్డి, పద్మారెడ్డి, కర్ణాకర్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: