ముద్దం ప్రకాష్ మృతి జిల్లా దళిత లోకానికి తీరనిలోటు

Published: Saturday May 29, 2021
 - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, మే 28, ప్రజాపాలన ప్రతినిధి : జగిత్యాల జిల్లా పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ మరియు జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు అంబేద్కర్ సంఘం జాతీయ కార్యదర్శి ముద్దం ప్రకాష్ కరోనాతో బాధపడుతు మృతి చెందడం జగిత్యాల జిల్లా దళిత బహుజన సంఘాలకు తీరని లోటని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులలు అర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్నీ కోరారు. జిల్లాలో దళిత బడుగు బలహీన వర్గాలకు సేవతో పాటు అధికారులకు నాయకులకు ప్రజా సంఘాలకు జిల్లాలో మంచి సూపరిషితున్ని కోల్పోవడం ఆయన మరణాన్ని వ్యక్తిగతంగా జీర్ణించుకోలేక పోతున్నామని జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సబ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు వడ్లూరి లక్ష్మణ్ కుమార్ బండ శంకర్ బాలే శంకర్ నక్క జీవన్ కల్లెపల్లి దుర్గయ్య దుమాల రాజ్ కుమార్ కాయితి శంకర్ ధర రమేష్ దుమాల గంగారాం వివిధ దళిత బహుజన సంఘాల నాయకులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.