కాంగ్రెస్ నాయకుడి కారు అద్దాన్ని ధ్వంసం చేసిన దుండగులు శంకరపట్నం జనవరి 24 ప్రజాపాలన రిపోర్ట

Published: Wednesday January 25, 2023

శంకరపట్నం మండల కేంద్రంలో మంగళవారం నిలిపి ఉంచిన కారు అద్దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పగల గొట్టడం స్థానికంగా చర్చినీయాంశమైనది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాంపల్లి తిరుపతి రహదారి పక్కన నిలిపి ఉంచగా కారు అద్దాన్ని రాయితో పగులగొట్టారు. స్థానిక ప్రజాప్రతినిధి జన్మదిన వేడుక ర్యాలీలో పాల్గొన్న యువకులుగా తిరుపతి అనుమానిస్తున్నారు. మండల కేంద్రంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దుండగులను గుర్తించడం కష్టతరంగా మారింది. ఇలాంటి ఘటనలు, దొంగతనాలు, పునరావృతం కాకండా ఉండెందుకు రక్షణ చర్యల్లో బాగంగా సీ సి టీవీ కెమెరాలు ఏర్పాటు చేయలని స్థానికులు కోరుతున్నారు.