కామ్రేడ్ అరి పెల్లి రామస్వామి ఆకస్మిక మృతి
Published: Friday December 17, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్ క్ చెందిన సిపిఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ అరిపెల్లి రామస్వామి గురువారం నాడు ఆకస్మికంగా మృతి చెందటం భారత కమ్యూనిస్టు పార్టీకి తీరనిలోటని జిల్లా కార్యవర్గ సభ్యుడు మామిడాల రాజేశం అన్నారు. రామస్వామి స్వగృహంలో పార్థివ దేహానికి పూలమాలలు వేసి సంతాపాన్ని తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరిపెల్లి రామస్వామి బ్రతికి ఉన్నంత వరకు పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి నీతి నిజాయితీతో పని చేసేవాడిని ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Share this on your social network: