"రామయ్య మాస్టారు" ట్రైలర్ విడుదల

Published: Monday February 15, 2021
మధిర, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: మధిరలోని ఖాజిపురం గ్రామానికి చెందిన యువ దర్శకుడు "ఎ.ఆర్.సమీర్" నూతన చిత్రం "రామయ్య మాస్టారు" ట్రైలర్ విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను పొందుతుంది ఈ సందర్భంగా దర్శకుడు ఎ.ఆర్.సమీర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తాను ఎంతో కష్టపడి తీశానని మరియు ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా మరియు యువతకు మంచి సందేశాన్నిచ్చే మంచి కథతో  అలరిస్తుందని తెలియజేశారు ఈ చిత్రం ట్రైలర్ ని యుట్యూబ్ లో తన "AR SAMEER Talkies" ఛానల్ లో వీక్షించి,షేర్ చేసి తన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోని సపోర్ట్ చేయవల్సిందిగా కోరారు. ఈ చిత్రానికి నదీమ్ కెమెరామెన్ గా చేయగా, శోభన్ బాబు భోగరాజు, ప్రవీణ్ చిన్నా, జానీ, సాయి బాబు, ఎ.ఆర్.సమీర్, రమీజ్, నదీమ్, నెమలి రవి, అబ్దుల్, రాజు నటించారు.