ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమంలో రాథోడ్ రమేష్

Published: Monday February 13, 2023
జన్నారం, ఫిబ్రవరి 12, ప్రజాపాలన: 
ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ నాయకుడు రాథోర రమేష్ పాల్గొన్నారు. ఆదివారం మండలంలోని దేవుని గూడా చర్లపల్లి గ్రామాలలో విస్తృతంగా ఇంటింటికి తిరుగుతూ బిజెపి చేపట్టిన పథకాలను వివరించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బిజెపి అధికారంలోకి వస్తేనే పలు సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంతన వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. చల్లపల్లి గ్రామం హనుమాన్ ఆలయంలో రాథోడ్ రమేష్ని ఆ గ్రామ యూత్ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోలిచంద్, కొంతం శంకరయ్య, జక్కుల సురేష్, బుర్ర గడ్డ జగన్, బీజేవైఎం జిల్లా నాయకులు కొండపల్లి మహేష్, దండవేణి శ్రీధర్, చంద్రమౌళి యూత్ సభ్యులు గ్రామస్తులు మండల నాయకులు పాల్గొన్నారు.