పోడు భూముల కోసం సమగ్ర సర్వే జరగాలి.

Published: Tuesday October 04, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.
సమగ్ర సర్వే తో పోడు రైతులకు పట్టాలి ఇవ్వాలన
 భూములకు  సమగ్ర సర్వే తో  రైతులకు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం బూర్గంపాడు మండలం పరిధిలో బుడ్డగూడెం గ్రామంలో పోడు రైతుల సమావేశం మీడియం పుల్లయ్య అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోడు భూమి 1996 నుండి సాగు చేస్తున్న గిరిజనుల దగ్గర నుండి భూమి బలవంతంగా లాక్కుంటున్నారని .గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి గిరిజనల దగ్గరుండి దరఖాస్తు తీసుకున్నారని. సుమారు 2000 చిల్లర దరఖాస్తులు అధికారులకు ఇచ్చారని 10,000 ఎకరాల భూమి గిరిజనుల దగ్గర. ఉందని వెంటనే దరఖాస్తు చేసుకున్న వారికి అటవి హక్కుల చట్టం 2006లో సిపిఎం పార్టీ ఆనాడు కేంద్రం ప్రభుత్వానికి  మద్దతు ఇవ్వటం వల్ల
 వచ్చిందని ఈ సందర్భంగా అన్నారు 
 సెప్టెంబర్ 3న సిపిఎం పార్టీ రాష్ట్ర బృందం ఆధ్వర్యంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణ ప్రభుత్వానికి మెమోండరం అందిచ్చారని
 పోడు భూమికి దక్షిణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అందువల్ల ఇప్పుడు జరుగుతున్న సర్వే గిరిజనులకు అందరికీ అటవి హక్కుల చట్టం హక్కు పత్రాలు అందించాలని  కోరారు
 ఈ కార్యక్రమంలో వ్యకస జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల అప్పారావు, మీడియం శ్రీను, కుడిమ వెంకటేశ్వర్లు, కుర్స తిరుపతిరావు ,బొర్రా కృష్ణ, సోడే రాజు, మీడియం కృష్ణ ,కనితి అర్జున్ ,సో డే వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు