హరితహారంలో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ

Published: Monday July 12, 2021
మేడిపల్లి, జూలై11 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్లోని శ్రీపాద కాలనీ, విష్ణుపురి ఎంక్లేవ్ కాలనీలలో ప్రతి ఇంటికి 6 మొక్కలు చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.