ఖబడ్దార్ ఎంపీ అరవింద్ – ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు అర్థరహితం - 5వ వార్డు కౌన్సిలర్ పలుగుట్ట ప్ర
వికారాబాద్ బ్యూరో 19 నవంబర్ ప్రజా పాలన : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై 5వ వార్డు కౌన్సిలర్ పలుగుట్ట ప్రవళిక కృష్ణ మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఖబడ్దార్ అంటూ ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితపై అభాండాలు వేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. కేసీఆర్ కుటుంబంపై మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. పసుపు బోర్డుపై దొంగ బాండ్ పేపర్ రాసి రైతులను మోసం చేసి గెలిచిన ఘనత ఎంపీ అరవింద్ది అని విమర్శించారు. ఇప్పటికైనా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తున్నారని, ఓ కళంకంగా మారుతున్నారని అన్నారు. కవితపై అనవసర ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితకు అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
Share this on your social network: