టిఆర్ఎస్ పార్టీ హయాంలోనే మధిర శరవేగంగా అభివృద్ధి.లింగాల కమల్ రాజు

Published: Tuesday July 26, 2022
మధిర జులై 25 ప్రజా పాలన ప్రతినిధిమున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కు భూమి పూజ చేసిన మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించబోతున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కు మున్సిపల్ చైర్మన్ మొండితోక లతా భూమి పూజ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో పోరాడిన తెలంగాణ కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం వలన దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా దూసుకుపోతోంది దానిలో భాగంగా గతంలో ఎన్నడూ జరిగనటువంటి మధిర నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మధిర అంబర్పేట చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణం పనులు, అంబేద్కర్ సెంటర్ సుందరీకరణ, సెంటర్ లైటింగ్ డివైడర్,పబ్లిక్ టాయిలెట్స్ లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కు భూమి పూజ చేసుకోవడం వ్యాపారులు మరియు మధిర ప్రజలు ఆనందించదగిన విషయమని అతి త్వరలోనే పూర్తి చేసి మున్సిపాలిటీ ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి, ఐటి మరియు పురపాలక శాఖ కల్వకుంట్ల తారక రామారావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదిర మున్సిపాలిటీ కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్స్, సొసైటీ అధ్యక్షులు బిక్క ప్రసాద్ గాంధీ రజిని మాధవి లక్ష్మి ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరావు కపిల్వాయిజగన్ మోహన్ రావు మున్సిపల్ సిబ్బంది కమిషనర్ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.