అనారోగ్యంతో సిపిఐ కార్యకర్త మృతి

Published: Thursday September 15, 2022

బోనకల్, సెప్టెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని రాయన్నపేట గ్రామానికి చెందిన సిపిఐ కార్యకర్త తోటపల్లి వెంకటేశ్వర్లు(50) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు . ఆయన మృతదేహానికి సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్ పార్టీ జెండాను కప్పి, పూలమాలవేసి నివాళులు అర్పించారు. మృతునికి కుమారుడు కుమార్తె ఉన్నారు. మృతిని కుటుంబానికి బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ రూ. 3000 లను సొసైటీ డైరెక్టర్లు మరీదు ఈశ్వరమ్మ, మరీదు వెంకటేశ్వర్లు రూ. 1000 లను వారి కుటుంబానికి అందజేశారు. నివాళులర్పించిన వారిలో బొమ్మినేని కొండలరావు, ఏలూరు పూర్ణచందు, తోటపల్లి ఆనందరావు, వల్లేబోయిన వీరభద్రం తదితరులు ఉన్నారు.