జూన్ 4న జరిగే మహాజన జిల్లా సదస్సును జయప్రదం చేయండి.

Published: Tuesday May 31, 2022

భద్రాద్రి కొత్త గూడెం(ప్రజాపాలన బ్యూరో)భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఎస్ ఆర్ కాలనీ నందు సోమవారం మహాజన సోషలిస్టు పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమక  నరేష్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశం ఉద్దేశించి యం ఎస్పీ జిల్లా నాయకులు అలవాల రాజా పెరియార్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతుందని,ముఖ్యమంత్రి కేసీఆర్ తన7 ఏళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ను పాలనలో  నమ్మించి మోసం చేశారని,ఆత్మగౌరవ పాలన కోరుకున్న తెలంగాణ ప్రజలను బానిసలు గా చూస్తూ హక్కులు లేని,వాటా లేని, ఉద్యోగాలు లేని,రాజరిక వ్యవస్థ నడిపిస్తున్నారని,దొరల పాలన అంతమొందించాలంటే మహాజన సోషలిస్టు పార్టీని ఆదరించాలని,మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ  తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ఆర్థిక బలం అంగ బలం రాజకీయ బలం లేకుండానే సమస్త కులాలకు కులమత బేధాలు లేకుండా సంక్షేమ పథకాలను సాధించిపెట్టిన ఘనత ఉన్నదని అన్నారు.తెలంగాణలోని 90 శాతం ప్రతి ఇండ్లల్లో మందకృష్ణ మాదిగ ను సాధించిన ఫలితాలే ఉన్నాయని,ఆరోగ్యశ్రీ ,వికలాంగుల,వృద్ధులు, వితంతువుల పెన్షన్, బియ్యం కోటా పెంపు,ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు,ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ,ఎస్సీ ఎస్టీల ప్రమోషన్లలో రిజర్వేషన్లు,ప్రతి ఇంట్లో అందుతున్నాయని గుర్తు చేశారు.మహా జనుల రాజ్యాధికార ఆకాంక్ష లో భాగంగా జూన్ 4న మహాజన జిల్లా సదస్సు నిర్వహించడం జరుగుతుందని,ఈ జిల్లా సదస్సుకు ముఖ్యఅతిథిగా మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్  హాజరవుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం జయప్రదం కోసం మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా,మండల,నాయకత్వం సకాలంలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ నాయకులు బొక్క రాంబాబు,బి సత్యనారాయణ,మహాజన మహిళా సమాఖ్య జిల్లా అధికార ప్రతినిధి ఇల్లందుల హేమలత,కళ్యాణి,పార్వతి,రాఘవులు,నాగమణి తదితరులు పాల్గొన్నారు.